Viral News: రైలు పట్టాలపై కుప్పలుగా అమెజాన్ డెలివరీ ప్యాకెట్లు.. ఎందుకో తెలిస్తే షాక్.! - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Tuesday, January 18, 2022

Viral News: రైలు పట్టాలపై కుప్పలుగా అమెజాన్ డెలివరీ ప్యాకెట్లు.. ఎందుకో తెలిస్తే షాక్.!

Viral News: రైలు పట్టాలపై కుప్పలుగా అమెజాన్ డెలివరీ ప్యాకెట్లు.. ఎందుకో తెలిస్తే షాక్.!

అమెరికాలో సరుకు రవాణ రైళ్లపై దొంగలు దాడికి తెగబడుతున్నారు. రైళ్లు ఆగే ప్రాంతంలో దోపిడీలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో...

Viral News: రైలు పట్టాలపై కుప్పలుగా అమెజాన్ డెలివరీ ప్యాకెట్లు.. ఎందుకో తెలిస్తే షాక్.!


అమెరికాలో సరుకు రవాణ రైళ్లపై దొంగలు దాడికి తెగబడుతున్నారు. రైళ్లు ఆగే ప్రాంతంలో దోపిడీలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన డజన్లకొద్ది పాకెట్లను ఎత్తుకుపోతున్నారు. లాస్‌ ఏంజెల్స్‌ నగరంలో ఈ తరహా దాడులు ఎక్కువయ్యాయి. రైలు పట్టాలపై కొన్ని వేల ఆన్‌లైన్‌ ప్యాకేజ్‌లు పడి ఉండటాన్ని చూసి రైల్వే సంస్థ కంగుతింది. దొంగల ముఠా దెబ్బకు ఆన్‌లైన వ్యాపార సంస్థలు అమెజాన్‌, ఫెడ్‌ఎక్స్‌ లాంటివి భారీగా నష్టపోతున్నాయి.


ఈ దొంగతనాలకు అడ్డుకట్టవేయడానికి డ్రోన్‌లతో నిఘా చర్యలను బలోపేతం చేసింది యూనియన్ పసిఫిక్ రైల్వేసంస్థ. మరింత మంది భద్రతా సిబ్బందిని నియమించింది. కాగా.. దొంగల్ని పట్టుకున్న తర్వాత కోర్టు చిన్న నేరంగా పరిగణించి ఓ మోస్తరు జరిమానా విధించి వదిలేయడంతో వాళ్లు 24 గంటల్లో బయటికొచ్చి మళ్ళీ దొంగతనాలు చేస్తున్నారని, విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులపై కూడా దాడులు చేస్తున్నారట. ఈ విషయమై శిక్షలు కఠినతరం చేయాలని యూనియన్‌ పసిఫిక్‌ సంస్థ.. లాస్‌ ఏంజెల్స్‌ కౌంటీ అటార్నీ కార్యాలయానికి లేఖ రాసింది.




 

No comments:

Post a Comment

Post Top Ad