TS RTC : కోడిపుంజుకు టికెట్.... ఏం జరిగిందో చెప్పిన ఎండీ సజ్జనార్... కండక్టర్‌పై చర్యలు.. - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Saturday, February 12, 2022

TS RTC : కోడిపుంజుకు టికెట్.... ఏం జరిగిందో చెప్పిన ఎండీ సజ్జనార్... కండక్టర్‌పై చర్యలు..

TS RTC : కోడిపుంజుకు టికెట్.... ఏం జరిగిందో చెప్పిన ఎండీ సజ్జనార్... కండక్టర్‌పై చర్యలు..


TS RTC : తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణికునికి ఓ వింత సంఘటన ఎదురైన విషయం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.. బస్సులో ప్రయాణికుడితో పాటు కోడికి కూడా కండక్టర్ టికెట్ కొట్టిన అంశంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించా

 TS RTC : కోడిపుంజుకు టికెట్.... ఏం జరిగిందో చెప్పిన ఎండీ సజ్జనార్... కండక్టర్‌పై చర్యలు..

మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గోదావరి ఖని డిపో నుండి కరీంనగర్ పట్టణానికి బయలుదేరిన బస్సులో మహ్మద్ ఆలీ అనే ప్రయాణికుడు ఎక్కాడు. అయితే ఆలీ తనతో పాటు ఓ కోడిపుంజును కూడా తనతో పాటు తీసుకుని వచ్చాడు.. కోడిని ఎవరికి కనబడకుండా ఓ సంచిలో మూటగట్టి పెట్టాడు..అయితే బస్సు సుల్తానాబాద్‌కు చేరుకోగానే..బస్సు కుదుపులకు కోడి ఒక్కసారిగా అరిచిందని,దీంతో కోడికి సైతం ఫుల్ టికెట్ కండక్టర్ ఇచ్చాడు..ఇదేంటని అడిగితే కండక్టర్ ఇలా సమాధానం చెప్పాడు. ప్రయాణికుడితో పాటు ప్రాణం ఉన్న ఏ జీవి బస్సులో ప్రయాణించినా టికెట్ తీసుకోవాలని ఆదేశాలు ఉన్నట్టు వివరించాడు బస్సు కండక్టర్. సో దీంతో కండక్టర్ ఇదే విషయం మీడియాకు సైతం వివరించడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


అయితే ఘటనపై టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ స్పందించారు.. అసలు ఎం జరిగింది. కండక్టర్ ఎందుకు టికెట్ కొట్టాల్సి వచ్చిందో వివరించారు.వాస్తవానికి బస్సల్లో పశువులకు అనుమతి లేదు. కాని బస్సులో కోడితో ప్రయాణిస్తున్న ప్రయాణికునితో ఉన్న కోడిపుంజును సుల్తాన్​బాద్​ దగ్గర కండక్టర్ గుర్తించిన తర్వాత​ ఆ ప్రయాణికుడ్నికండక్టర్ ప్రశ్నించాడు. అయితే అదే బస్సులో ఉన్న శ్రీ కుమార్​ అనే ఓ న్యూస్​ రిపోర్టర్.. కండక్టర్​ను టికెట్​ కొట్టమని​ వుసిగొల్పాడని తెలిపాడు..ఉద్దేశ్యపూర్వకంగానే హాట్​ న్యూస్​ కోసం ఆ రిపోర్టర్ అలా ప్రోత్సహించడంతో బస్సు కండక్టర్​ ఆ రిపోర్టర్ ప్రభావంతో కోడిపుంజుకు ఫుల్ టికెట్ కొట్టాడు.అయితే బస్సులో ఉన్న కండక్టర్​ ఆ రిపోర్టర్ చెప్పినట్లు..​ అలా ప్రవర్తించాల్సింది కాదని వివరించాడు..ఏది ఏమైనా బస్సు కండక్టర్​ మీద చర్యలు తీసుకుంటామని సజ్జనార్ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్​ చేశారు.


అయితే ఆర్టీసీ ఇటివల మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ ఓ ఆఫర్ ప్రకటించింది. బస్సులో కోళ్లు, మేకలు సైతం తీసుకుని వెళ్లవచ్చంటూ అనుమతి ఇచ్చింది. మరి అప్పుడు వాటికి కూడా టికెట్స్ ఇస్తారా లేదా ఉచితంగానే అనుమతిస్తారా అనేది వేచి చూడాలి.

No comments:

Post a Comment

Post Top Ad