ఆంధ్రా రైల్వే ప్రయాణికులకు శుభవార్త: సాధారణ టికెట్‌తో రిజర్వుడ్ కోచ్‌లో ప్రయాణం.. వివరాలివే! - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Thursday, February 24, 2022

ఆంధ్రా రైల్వే ప్రయాణికులకు శుభవార్త: సాధారణ టికెట్‌తో రిజర్వుడ్ కోచ్‌లో ప్రయాణం.. వివరాలివే!

ఆంధ్రా రైల్వే ప్రయాణికులకు శుభవార్త: సాధారణ టికెట్‌తో రిజర్వుడ్ కోచ్‌లో ప్రయాణం.. వివరాలివే!

ఆంధ్రా రైల్వే ప్రయాణికులకు శుభవార్త: సాధారణ టికెట్‌తో రిజర్వుడ్ కోచ్‌లో ప్రయాణం.. వివరాలివే!

సాధారణ టికెట్‌తో రిజర్వుడు కోచ్‌లో ప్రయాణించేలా ప్రయాణికులకు విజయవాడ రైల్వే శుభవార్త చెప్పింది. ఏపీ నుంచి వివిధ ప్రాంతాలకు..!

ప్రయాణికులకు విజయవాడ రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వుడు కోచ్‌లను సాధారణ కోచ్‌లుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. అన్‌ రిజర్వ్‌డ్‌ ప్రయాణికుల సౌకర్యం కోసం విజయవాడ డివిజన్‌ పరిధిలో నడిచే 50 రైళ్లలో కొన్ని రిజర్వ్‌డ్‌ కోచ్‌లను సాధారణ కోచ్‌లుగా మార్చి నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నస్రత్‌ మండ్రూపక్కర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

విజయవాడ నుంచి ఏపీ, తెలంగాణలోని ముఖ్య ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ మేరకు ఈ సౌకర్యం లభించనున్నట్లు నస్రత్‌ పేర్కొన్నారు. మొత్తం 50 రైళ్లలో రిజర్వుడు కోచ్‌ల్లో సాధారణ ప్రయాణికులు ఎక్కేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

గూడురు- సికింద్రాబాద్, గూడురు- విజయవాడ, విజయవాడ- సికింద్రాబాద్, నర్సాపూర్‌- ధర్మవరం, తిరుపతి- కాకినాడ టౌన్, నర్సాపూర్‌- లింగంపల్లి, మచిలీపట్నం- బీదర్, విజయవాడ- లింగంపల్లి, తిరుపతి- ఆదిలాబాద్‌ రైళ్లతో సహా 50 రైళ్లలో గుర్తించిన కొన్ని రిజర్వ్‌డ్‌ కోచ్‌లలో సాధారణ ప్రయాణికులు ఎక్కేందుకు అవకాశం కల్పించినట్లు ఆమె తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

No comments:

Post a Comment

Post Top Ad